Font Size
మార్కు 8:27-29
Telugu Holy Bible: Easy-to-Read Version
మార్కు 8:27-29
Telugu Holy Bible: Easy-to-Read Version
పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం
(మత్తయి 16:13-20; లూకా 9:18-21)
27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.
28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.
పేతురు, “మీరే క్రీస్తు”[a] అని సమాధానం చెప్పాడు.
Read full chapterFootnotes
- 8:29 క్రీస్తు లేక మెస్సీయ.
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International